బాన్సువాడలో అంబేద్కర్ జయంతి… పోచారం ఘన నివాళి
Published on 14 Apr 2026, 05:24 PM 70
JH-37261
జనహితం న్యూస్, కామారెడ్డి: భారతరత్న, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని బస్టాండు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్న బాన్సువాడ డీఎస్పీ, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూస్వాతంత్రం అనతరం పరిపాలన సౌలభ్యం కోసం భారతదేశానికి దిక్సూచి వంటి రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ కోట్ల జనాభాతో, విభిన్న జాతులు, మతాలు, సంస్కృతులతో కూడిన భారతదేశంలో నేడు పరిపాలన ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగుతూ, అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయంటే అది రాజ్యాంగ స్పూర్తి అని అన్నారు ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ భారత నిర్మాణానికి బాటలు వేద్దాం అని తెలిపారు.
