బాన్సువాడలో ప్రజా పాలన ప్రగతి సమావేశం.. కీలక శాఖలతో భారీ రివ్యూ!
Published on 16 Apr 2026, 08:25 PM 98
JH-31777
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల స్థాయిలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల పరిషత్ ఆవరణలో అందరూ మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, పౌరసరఫర శాఖ, మహిళా సంక్షేమ శిశు సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐకెపి మొదలగు శాఖలు హాజరవడం జరిగింది.
ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ అయినటువంటి కాసుల బాలరాజు ముఖ్య అతిథిగా రావడం మండలం మండల ప్రత్యేక అధికారి అయినటువంటి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రమీల తెలిపారు.
