బాన్సువాడలో సడెన్ రైడ్స్.. 73 కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేత
Published on 09 Apr 2026, 05:49 PM 97
JH-79791
జనహితం న్యూస్, కామారెడ్డి: బాన్సువాడ పట్టణంలో గురువారం సివిల్ సప్లై అధికారులు పలు రైస్ డిపోలపై అకస్మిక దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన సూమారు 73 కిలోల పీడీఎస్ బియ్యం, నూకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీటీ సివిల్ సప్లై అధికారి షరీఫ్ ఆధ్వర్యంలో డిపోలపై తనిఖీలు చేపట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రైస్ డిపోను సీజ్ చేశారు.
