సింగూర్ నుంచి నీరు వెంటనే విడుదల చేయాలి – రైతుల తరఫున పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్
Published on 06 Apr 2026, 12:58 PM 96
JH-11723
జనహితం న్యూస్, మెదక్ రూరల్ ఏప్రిల్ 06: సింగూర్ ప్రాజెక్టు నుంచి వనదుర్గ ప్రాజెక్టు ఘనపూర్ ఆయకట్టకు వెంటనే 0.3 టీఎంసీ నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ను ప్రతిమ సింగ్ ను బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు, కౌన్సిలర్లతో కలిసి సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టకు నీటి విడుదలకు సంబంధించి వినతిపత్రం సమర్పించారు.
