తెలంగాణపై వ్యాఖ్యలు… తేజస్వి సూర్యపై బీఆర్ఎస్ ఫిర్యాదు
Published on 17 Apr 2026, 04:46 PM 65
JH-41669
జనహితం న్యూస్, వర్ని: నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రఏర్పాటు పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తీవ్రంగా ఖండిస్తు అతను చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, అలాగే తెలంగాణ ప్రజలకు మరియు ఉద్యమకారులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు వర్ని పోలీస్ స్టేషన్లో BRS పార్టీ కార్యకర్తలు Tejasvi Surya గారిపై ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమకారుడు కుంకుమ దత్తు గారు, Y.S. దాస్, ఆనంద్ సెరుపులే, గైని లక్ష్మణ్, బంటి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
