హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
16లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్?.. ఎంపీ కడియం కావ్య డిమాండ్ JH-40131

జనహితం న్యూస్: దేశవ్యాప్తంగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వేదికలపై నిషేధం విధించాలని వరంగల్ లోక్‌సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియా ప్రభావంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీ ఈ అంశాన్ని ప్రస్తావించారు..

సోషల్ మీడియా వేదికల దుర్వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతున్నదని ఎంపీ డా.కడియం కావ్య ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచార వ్యాప్తి, ఆన్‌లైన్‌లో పెరుగుతున్న విషపూరిత వ్యాఖ్యలు, సమాజంలో విభేదాలను పెంచే పరిస్థితులు వంటి అంశాలను ఎంపీ ప్రస్తావించారు. నియంత్రణలు లేకుండా కొనసాగుతున్న డిజిటల్ వేదికలు ప్రజాభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు నెలకొంటున్నాయని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు.

సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అభిప్రాయపడ్డారు. అవసరమైతే 16 ఏళ్ల లోపు వయస్సు గల వారికి సోషల్ మీడియా వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించాన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
16లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్?.. ఎంపీ కడియం కావ్య డిమాండ్
16లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్?.. ఎంపీ కడియం కావ్య డిమాండ్

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్