ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ
Published on 01 Apr 2026, 10:28 AM 27
JH-96537
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం వల్లంపట్ల పంచాయతీ పరిధిలో మల్లు కుంట గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్న ఆర్టికల్చర్ అసిస్టెంట్ దీపిక ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ పెన్షన్ భరోసా సకాలంలో అందరూ వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవలసిందిగా ఉదయం 6 గంటలనుండి ప్రతి ఇంటింటికి వెళ్లి అవ్వ తాతలను ఆప్యాయంగా పలకరించి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు మొత్తం పెన్షన్లు 72 పంపిణీ చేయవలసి ఉంది అందుకుగాను ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులు మరియు అధికారులు పాల్గొన్నారు
