పార్టీ బలోపేతానికి శివంగుల సత్యనారాయణ కృషి
Published on 02 Apr 2026, 06:55 PM 9
JH-38294
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టి. నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు శివంగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో కార్యకర్తలను సమన్వయం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. పార్టీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను స్థానిక నాయకులు అభినందించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా సత్యనారాయణ తెలిపారు.
