టీ నర్సాపురంలో టీడీపీ 44వ వేడుకలు – శీలం వెంకటేశ్వరరావు హాజరు
Published on 29 Mar 2026, 01:35 PM 29
JH-65931
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం లోని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండల కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శీలం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కార్యకర్తలు ఐక్యమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు కాల్నిడి రాంబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు కొల్లి రమేష్,సెక్రటరీ జోనబోయిన శేషరావు, సొసైటీ చైర్ పర్సన్ జోనబోయిన సోంబాబు, మండల తెలుగుయువత అధ్యక్షులు కె. శ్రీనివాస్ అంతేకాకుండా మాజీ వైస్ ఎంపీపీ అర్ధంకి జగ్గారావు, నీటి సంఘ అధ్యక్షులు కోనకల్లా మోహన్ రావు, నాయకులు మోదుగు రామారావు, కిలారి సాంబశివరావు, కొల్లి మురళి, ఏపుకుంట సాధనాల భూసిబాబు, బాషా తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
