ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు
Published on 14 Apr 2026, 05:45 PM 104
JH-31152
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లో ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశాయిపేట్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భువనేకర్ జ్యోతి ప్రకాష్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని అదేవిధంగా మహిళలకు అనేక హక్కులు కల్పించి భారతదేశంలోని ప్రజలందరికీ ఓటు హక్కును ప్రసాదించిన మహానీయుడని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుఅయ్యాల సంతోష్, మాజీ ఎంపీపీ ప్రకాష్, ఉపసర్పంచ్ పండరి గౌడ్, వార్డ్ సభ్యులు వినయ్, గోపాల గంగాధర్, ఆరిఫ్, అoకోల్ సాయిలు, జ్ఞానేశ్వర్, గరిగళ్ల బాలయ్య, జంగం రాజు, మారపు సాయిలు,సాయికుమార్, పీరయ్య తదితరులు పాల్గొన్నారు.
