ఇంట్లో విషాదం.. వెంటనే చేరుకుని కుటుంబాన్ని పరామర్శించిన ఏలే మల్లికార్జున్
Published on 21 Apr 2026, 02:14 PM 63
JH-51353
జనహితం న్యూస్, నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త అందే పాపయ్య అత్తగారు అందే సాయవ్వ నిన్న రాత్రి పరమపదించారు. ఈ విషాద వార్త తెలుసుకున్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు వెంటనే వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలని ప్రోత్సహించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేసిన ఏలే మల్లికార్జున్.
