కామారెడ్డిలో వరి కొనుగోలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Published on 05 Apr 2026, 06:06 PM 31
JH-96306
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన కీలక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సివిల్ సప్లయ్ కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ 08468-220051 అనే కంట్రోల్ రూమ్ నంబర్ను ప్రజలకు అందుబాటులో ఉంచుతూ, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రైతులు తమకు ఎదురయ్యే సమస్యలు, సందేహాలు, కొనుగోలు సంబంధిత వివరాల కోసం ఈ నంబర్ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
వరి కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం, సమర్థతను పెంచేందుకు ఈ కంట్రోల్ రూమ్ అధికారులు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై మేనేజర్ శ్రీకాంత్, జిల్లా సహకారాధికారి, రామ్మోహన్, కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
