డా.బాబు జగ్జీవన్ రామ్ ఆయన సేవల్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నాం - 119వ జయంతి
Published on 05 Apr 2026, 08:06 PM 21
JH-87631
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ గ్రౌండ్లో డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ.., భారతదేశానికి చేసిన సేవలు అనితరసాధారణం, ఆయన ఒక సామాజిక న్యాయ యోధుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ ముఖ్యమైన సేవలు సామాజిక న్యాయం అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు.
రాజకీయ జీవితం:
- 1936 నుండి 1986 వరకు పార్లిమెంటు సభ్యుడిగా పనిచేశారు.
- మినిస్టర్: కార్మిక, రక్షణ, వ్యవసాయ మంత్రిగా పనిచేశారు.
- ఉప ప్రధాని: 1977-79లో భారతదేశ ఉప ప్రధానిగా పనిచేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా రూ 5 లక్షలు ఇస్తున్నారు కానీ ఎస్సీలకు ప్రత్యేక గుర్తించి 8 లక్షలు వరకు ఇవ్వాలి లేదా ఇసుక సిమెంటు స్టీల్ ఫ్రీగా ఇవ్వాలి.
గవర్నమెంట్ దృష్టికి అడిషనల్ కలెక్టర్ చెప్పడం జరిగింది. గ్రామసభలో తీర్మానం చేయాలి మరియు అసైన్మెంట్ భూములు పట్టాలు గా మార్చి ఇవ్వాలి కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ సార్ ఆర్డీవో ఈడి వెంకటేశ్ గ్రంథాలయచైర్మన్ మున్సిపాలిటీ చైర్మన్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గంగారం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కాసిరం, భాగయ్య బలరాం, వెంకట్ రవీందర్ రాజు, వివిధ సంఘ నాయకులు పాల్గొన్నారు.
