జోడ హన్మండ్ల స్వామి వారిని దర్శించుకున్న పోచారం సతీమణి
Published on 04 Apr 2026, 05:54 PM 53
JH-22335
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం తన అమ్మగారి ఊరు ఇబ్రహీంపేట్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, రుక్మిణి విట్ఠలేశ్వర స్వామి వారిని, జోడ హన్మండ్ల స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి శ్రీమతి పుష్ప ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంబరపడ్డారు.
ఈ పూజ కార్యక్రమంలో శ్రీమతి పుష్ప వెంట సోదరుడు ఇబ్రహీంపేట్ మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి బంధువులు మాజీ పిఎసిఎస్ ఛైర్మెన్ నారాయణ రెడ్డి, రాజి రెడ్డి, మోహన్ నాయక్, శ్రీనివాస్ సెట్, క్లాస్ వన్ కాంట్రాక్టర్ ప్రవీణ్ రెడ్డి, చరణ్ రెడ్డి, అంబయ్య, పండరి తదితరులు ఉన్నారు.
