పదవ తరగతి మూల్యాంకన బకాయిలను వెంటనే విడుదల చేయాలి :తపస్
Published on 04 Apr 2026, 04:19 PM 100
JH-89436
జనహితం న్యూస్, మెదక్ రూరల్: గత సంవత్సరం పదో తరగతి మూల్యాంకనం లో పాల్గొని నేటికి డబ్బులు రాని ఉపాధ్యాయులకు వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, పదవ తరగతి మూల్యాంకన కేంద్రంలో ఎండ వేడిమి దృశ్య కూలర్లు ఏర్పాటు చేయాలని, సెలవు రోజులలో కూడా మూల్యాంకనం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కే. విజయ కు తపస్ మెదక్ జిల్లా పక్షాన ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దు,జిల్లా నాయకులు మంగ నర్సింలు, శ్రీధర్ రెడ్డి, ఉమ్లా నాయక్, మన్నె గోపాల్, శ్రీకాంత్ శర్మ, ప్రభాకర్, నవాథ్ చంద్రశేఖర్, చేగుంట, నార్సింగి తపస్ మండలల అధ్యక్షులు రావుల వెంకటేష్, తీగుళ్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.
