బుట్టయిగూడెం ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన వంకా కాంచనమాల
Published on 27 Mar 2026, 06:22 PM 31
JH-29776
జనహితం న్యూస్, బుట్టాయిగూడెం: ఏలూరు జిల్లా బుట్టయిగూడెం మండల ప్రజలకు మరియు హిందూ ధర్మబంధువులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ఎస్టీ మోర్చా కార్యదర్శి వంకా కాంచనమాల శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించారని కొనియాడారు. ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి ఆశీస్సులు మండల ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. ఈ పవిత్ర పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆమె కోరారు.
