ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు
Published on 27 Mar 2026, 03:54 PM 59
JH-50537
జనహితం న్యూస్, టీ నర్సాపురం మండలం: ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలం వీరభద్రవరం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు పాల్గొని ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సమాజంలో ధర్మం, న్యాయం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన కోరారు. రామరాజ్య స్థాపన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
