భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు - పవిత్రాత్మ కధోలిక చర్చ్
Published on 03 Apr 2026, 08:26 PM 48
JH-43303
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో పవిత్ర ఆత్మ కధోలిక దేవాలయం ఫాదర్ బి విజయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సుమారు 400 మంది సంఘ విశ్వాసులు క్రైస్తవ మధ్యలో భారీ సిలువ మార్గం మధ్యాహ్నపు వారి గూడెం నుండి బొర్రంపాలెం వరకు ప్రత్యేక ప్రార్థనలతో శిలువ మార్గం జరిగింది. ఫాదర్ ప్రవీణ్ మరియు ఫాదర్ సతీష్ ప్రత్యేక ప్రార్థనలు చేసి శిలువమార్గంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసి ప్రభువైన ఏసుక్రీస్తు మార్గం లో అందరూ నడుచుకోవాలని శాంతి సమాధానాలతో అందరూ కుల మత భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ప్రభువు మార్గంలో నడుచుకోవాలని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు మారుమూడి చిన్న వెంకటేశ్వరరావు, గుమ్మల్ల రామారావు, బోడ నాగేశ్వరరావు, గుండె మోహన్ రావు, యూత్ సభ్యులు కలపర్తి భాగ్యరాజు, మెరుగు వినయ్, సోడెం రాజ్ కుమార్ సిలువ మార్గంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
