క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే సొంగ రోషన్ ద్వారా ఆర్థిక సహాయం
Published on 18 Apr 2026, 08:20 PM 68
JH-45794
జనహితం న్యూస్, చింతలపూడి: చింతలపూడి మండలం అథోనీ నగర్ గ్రామానికి చెందిన నందిపం వెంకట్ కుమారుడు రోహంత్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. ఆయన పరిస్థితి తెలుసుకున్న చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి సమాజం మొత్తం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అందించే సహాయం మాత్రమే కాకుండా, దాతలు మరియు సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే తరఫున ₹10,000 సహాయం అందించగా, ప్రజాశక్తి గ్రూప్ నుంచి వచ్చిన ₹35,000తో కలిపి మొత్తం ₹45,000ను బాధిత కుటుంబానికి అందజేశారు.
బాధిత కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, చికిత్స ఖర్చులు అధికంగా ఉండటంతో మరింత సహాయం అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అందించిన సహాయానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
