పోలవరంలో అంబేద్కర్ జయంతి… బొరగం శ్రీనివాసులు కీలక సందేశం
Published on 14 Apr 2026, 08:24 PM 73
JH-79171
జనహితం న్యూస్, పోలవరం: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను పోలవరం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ మరియు పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బొరగం శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
