రైతు ఉత్సవాలకు సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆహ్వానం.
Published on 19 Mar 2026, 02:23 PM 31
JH-24337
జనహితం న్యూస్: ప్రజా పాలనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా “రైతు ఉత్సవాలు” కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారిని ఆహ్వానించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ గారు హాజరయ్యారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి కట్టుబడి ఉంది, ఈ నేపథ్యంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా “రైతు ఉత్సవాలు” నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ఉత్సవాలు మార్చి 19 నుంచి మార్చి 22, 2026 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి, ఈ ఉత్సవాల్లో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, ప్రదర్శనలు, చర్చలు, స్టాళ్లు మరియు ఇతర సంబంధిత కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు, మార్చి 22, 2026న రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది.
