హనుమాజీపేట్ లో హెచ్ పి వి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం
Published on 13 Apr 2026, 08:21 PM 88
JH-69469
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో హనుమాజీపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్పివి (హెచ్ పి వి ) వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. మహిళలు మరియు బాలికల ఆరోగ్య రక్షణలో ఈ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ఈ వ్యాక్సిన్ను ముఖ్యంగా 14 నుండి 15 సంవత్సరాల లోపు బాలికలకు మాత్రమే ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ (ప్రత్యేకంగా గర్భాశయ క్యాన్సర్) రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఉపయోగపడుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న మీనా, గ్రామ సర్పంచ్ లావణ్య, హెల్త్ సూపర్వైజర్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వారు హెచ్పివి వ్యాక్సిన్ అవసరం ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుని, తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు కోరారు.
