ఇందిరమ్మ ఇళ్లకు రూ.10 లక్షలు కావాలి.. ఎమ్మార్పీఎస్ గట్టి డిమాండ్!
Published on 16 Apr 2026, 07:55 PM 86
JH-67898
జనహితం న్యూస్, కామారెడ్డి: ఎస్సీలు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లకు రూ.10 లక్షల ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు భూమయ్య కోరారు. గురువారం బిచ్కుంద ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఇన్ చార్జి ఎంపీడీఓ గోపాల్ కృష్ణ కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇస్తున్న రూ. ఐదు లక్షలు సరిపోవడం లేదన్నారు. ఇసుక, స్టీలు ఫ్రీగా ఇస్తామని ప్రభుత్వం అన్నారు, లేకుంటే 10 లక్షలు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జుక్కల్ ఇన్ చార్జి ఎమ్మార్పీఎస్ యాదరావ్, వెండి రమేశ్, సాయిలు, రవి, మారుతి పాల్గొన్నారు.
