నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మ దేవేందర్ రెడ్డి
Published on 02 Apr 2026, 09:44 PM 46
JH-50117
జనహితం న్యూస్, మెదక్ రూరల్: ఏడుపాయల దేవస్థానం మాజీ ధర్మకర్త ఉప్పరి, వెంకటేశం కూతురు నందిని సతీష్ సాగర్ ల వివాహం పాపన్నపేట మండల కేంద్రంలోని మంజీరా గార్డెన్ ఘనంగా జరిగింది. ఈ వివాహానికి మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మాదేవేందర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్బంగా వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు. వీరి వెంట మెదక్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు జగన్, మాజీ సర్పంచులు గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, శ్రీనాథ్ రావు, నాయకులు సోములు, సుంకరి, కృష్ణ, దుర్గయ్య, అనిల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
