రంజాన్ తోఫా దుర్వినియోగం ఆరోపణలు – కలెక్టర్కు వినతి
Published on 20 Mar 2026, 08:58 PM 59
JH-48559
జనహితం న్యూస్ మెదక్ రూరల్ మార్చి 20: మెదక్ పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గిఫ్ట్ పేద ముస్లింల కొరకు తెచ్చిన రంజాన్ కానుక ప్యాక్ అందజేస్తున్న ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారని బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు కలెక్టర్ జెసి నగేష్ గారితో దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ అధికార పార్టీ లేని టిఆర్ఎస్ వాడు లలో కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం లేకుండా వివక్ష చూపుతూ ఎలాంటి మస్జిద్ కమిటీలకు ఇవ్వకుండా వారే అరత లేని వారు అనార్గులకు రంజాన్ కానుకలు ఇస్తూ దుర్వినియోగం చేశారని పేద ముస్లిం సోదరులకు చెందాల్సిన గిఫ్ట్ ప్యాక్ ను వారికి అందకుండా దుర్వినియోగం అయ్యాయని అడిషనల్ కలెక్టర్ కి విన్నవించడం జరిగింది.
కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డులకు సమానంగా బిఆర్ఎస్ కౌన్సిలర్ వార్డులకు సమానంగా పేద ముస్లిం వాళ్లకు అందజేయాలని అన్నారు కొందరి కను సర్వేలో సీఎం ముస్లింల కానుకలను ఒకటి తో మూడు రెండు ఇస్తూ మా వాడులలో ముస్లింలకు ఇవ్వకుండా కుట్ర పండుతున్నారని అన్నారు. రేపు పండగ సందర్భంగా బిఆర్ఎస్ కౌన్సిలర్ వాళ్లకు రంజాన్ కానుకలను టిఆర్ఎస్ వార్డుల కూ కూడా సమానంగా ఇవ్వాలని ఇవ్వకుంటే రంజాన్ పండుగకు మాపేద ముస్లిం దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ మరియు కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు బట్టి ఉదయ్, సోహెల్, జుబేర్ అహ్మద్, గౌస్ ఖురేషి, దీపక్, నాయకులు మాయా మల్లేష్, చిదాల నవీన్, బాలరాజు, ఫాజిల్, ఫరూక్, తదితరులు పాల్గొనడం జరిగింది.
