ఏడుపాయలలో క్యాటేజీలకు శశిధర్ రెడ్డి విజ్ఞప్తి
Published on 29 Mar 2026, 04:21 PM 63
JH-21842
జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా పపాన్నపేట్ మండల పరిదిలోనీ ఏడుపాయల క్షేత్రం అభివృద్ధి పై మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. భక్తుల వసతి కోసం 12 క్యాటేజీల నిర్మాణానికి రూ. 7 కోట్ల అంచనా తో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టూరిజం అధికారులను కోరారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన నిర్వహించారు. దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా పర్యాటక రంగాన్ని బలోపేతం చేయవచ్చని ఆయన అధికారులకు లేఖ రాశారు.
