బడాపహాడ్ యాత్రికుల బస్సు బోల్తా.. 8 మందికి తీవ్ర గాయాలు
Published on 03 Apr 2026, 01:42 PM 53
JH-80570
జనహితం న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బడాపహాడ్ బస్ బోల్తా యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బడాపహాడ్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పటాన్ చెరు ప్రాంతానికి చెందిన.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్ చెరు ప్రాంతానికి చెందిన యాత్రికులు ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో బడాపహాడ్ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బడాపహాడ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో మూలమలుపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో బోల్తాపడింది. ప్రమాదం తెల్లవారుజామున జరిగింది.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది యాత్రికులు ఉన్నారు. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
