పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై పోచారం,కాసుల
Published on 04 Apr 2026, 08:17 PM 57
JH-12067
జనహితం న్యూస్, నిజామాబాదు: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరై కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం భవనం, ఆరోగ్య ఉప కేంద్రం (హెల్త్ సబ్ సెంటర్) ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రంలో, కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పోచారం రైతులు తొందరపడి దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలి.
ప్రభుత్వ మద్దతు ధర
- A గ్రేడ్ క్వింటాలుకు రూ 2389/-
- B గ్రేడ్ క్వింటాలుకు రూ 2369/-
అనంతరం కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ సంఘం కళ్యాణ మండపాన్ని మరియు 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం (హెల్త్ సబ్ సెంటర్) ను ప్రారంభించిన పోచారం పాల్గొన్న పోతంగల్, కోటగిరి మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు.
