ఎంపీడీవో శాంతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ
Published on 01 Apr 2026, 08:40 PM 29
JH-85787
జనహితం న్యూస్, జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో ఎంపీడీవో శాంతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ చేయడం జరిగింది ఎంపీడీవో శాంతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ పెన్షన్ భరోసా అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నిటిని ప్రజల మధ్యకు వెళ్లేలా చూడాలని ఎంపీడీవో సంబంధిత అధికారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రవేశపెట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసి కొని సొంత ఇంటి కలను ప్రతి ఒక్కరు నెరవేర్చుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నక్క నాగమణి ఎన్టీఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులు పాల్గొన్నారు.
