ప్రజా సంక్షేమమే మా ధ్యేయం: రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ
Published on 31 Mar 2026, 11:09 AM 13
JH-88228
జనహితం న్యూస్, టి నర్సాపురం: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఏలూరు జిల్లా టీ. నరసాపురం మండలం తిరుమలదేవిపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.
రికార్డు స్థాయిలో ఇళ్ళ పంపిణీ...
గత 21 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 5,51,085 ఇళ్ళను పంపిణీ చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. పథకంలో భాగంగా:
మొదటి విడత (నవంబర్ 12, 2025): 3,00,192 ఇళ్ళ పంపిణీ పూర్తి.
రెండవ విడత: నేడు మరో 2,50,893 ఇళ్ళను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పేదల సొంతింటి సంతోషాన్ని పంచుతోందని రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ మరియు ఇతర స్థానిక నేతలు పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగంలో ఈ వేగం భవిష్యత్తులో మరిన్ని కుటుంబాలకు మేలు చేకూరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
