కేరళ పర్యటన ముగించుకుని వచ్చిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
Published on 07 Apr 2026, 05:55 PM 94
JH-80924
జనహితం న్యూస్, కామారెడ్డి: కేరళ రాష్ట్రంలోని అడూర్ నియోజకవర్గానికి ఏఐసీసీ పరిశీలకులుగా పర్యటించి తిరిగి వచ్చిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జుక్కల్లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ వారికి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అడూర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను సమీక్షించి విజయవంతంగా పర్యటన పూర్తి చేసుకున్న తోట లక్ష్మీకాంతరావు గారు, తిరిగి స్వగ్రామానికి చేరుకోవడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.., పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే స్వాగతం పలికి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు
