MGNREGS నిధులతో పోతంశెట్టిపల్లిలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
Published on 26 Mar 2026, 03:47 PM 60
JH-51582
జనహితం న్యూస్ మెదక్ రూరల్ మార్చి 26: మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో గురువారం రోజున మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారి సహకారం తో 10 లక్షల వ్యయం తో సి సి రోడ్ల నిర్మాణం ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్, గ్రామ సెక్రెటరీ అరుంధతి, 4 వార్డ్ మెంబర్ గొల్ల భాగ్యమ్మ ఏగొండ, గ్రామ ప్రజలు కొమ్ముల రాజగౌడ్,పట్లూరి శ్రీనివాస్ పటేల్, పట్లూరి నవీన్ పటేల్, బండల నర్సింలు, చాకలి నాగరాజు, గొల్ల అంజయ్య, సాయిని అంజయ్య, నాగం రమేష్ , మంగలి కిష్టయ్య, మంగలి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
