సింగూర్ నీరు విడుదల.. రైతులకు ఊరట - ఫలించిన పద్మ దేవేందర్ రెడ్డి కృషి
Published on 11 Apr 2026, 09:39 PM 130
JH-18871
జనహితం న్యూస్, మెదక్ రూరల్: నేడు సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆయాకట్టకు సాగునీరు విడుదల కావడంతో ప్రాంత రైతులకు ఊరట లభించింది. పంటలు కీలక దశలో ఉండటంతో నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి రైతులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి సాగునీరు అందించాలని కోరారు. ఇదే సమస్యను అసెంబ్లీలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే సమస్యను పద్మ దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, రైతులతో కలిసి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. పంటల పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న హెచ్ఆర్సీ కమిషనర్ వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరిగింది.
ఈ సందర్భంగా రైతులు పద్మ దేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.
