సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. లబ్ధిదారులకు ఊరట కల్పించిన ప్రభుత్వం
Published on 07 Apr 2026, 06:12 PM 103
JH-32352
జనహితం న్యూస్, కామారెడ్డి: నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామానికి చెందిన వేముల విట్టల్ మరియు బంజపల్లి గ్రామానికి చెందిన సమీర్కు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఈరోజు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించడం ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి పథకాలను వినియోగించుకుని తమ సమస్యలను అధిగమించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
