అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ.. ఎల్లారెడ్డిలో సహా పంక్తి భోజనం
Published on 15 Apr 2026, 08:21 PM 87
JH-17402
జనహితం న్యూస్, కామారెడ్డి: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో న్యాయ బోజ్ – సహా పంక్తి భోజనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని, గ్రామ ప్రజలతో కలిసి సహా పంక్తిలో భోజనం చేసి సామాజిక సమానత్వం, ఐక్యతకు ప్రాధాన్యతను చాటిచెప్పారు. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా స్థానిక సర్పంచులు, ఉపసర్పంచ్లు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
